Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం .. జిల్లాలకు చేరిన వ్యాక్సిన్ డోస్‌లు

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 14 జనవరి 2021 (07:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా టీకాలు వేయడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
భారీ బందోబస్తు మధ్య కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న 3.70 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. కేసుల తీవ్రత, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వేల సంఖ్యలో డోసులు పంపారు. 
 
ఆ ప్రకారంగా, కృష్ణా జిల్లాకు 42,500 డోసులు, గుంటూరు జిల్లాకు 43,500 డోసులు తరలించారు. దాంతోపాటు ప్రకాశం జిల్లా 31 వేలు, నెల్లూరుకు 38,500 డోసులు, వెస్ట్‌గోదావరి 33,500, ఈస్ట్‌గోదావరి జిల్లాకు 47 వేలు డోసులు పంపించారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు 26,500, విశాఖకు 46,500, విజయనగరం 21,500, అనంతపురం జిల్లాకు 35,500, కడప జిల్లాకు 28,500, కర్నూలుకు 40,500 వ్యాక్సిన్‌ డోసులు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో చరిత్ర పుటల్లో తొలి అధ్యక్షుడుగా ట్రంప్!