Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిగజారుడు రాజకీయాలు చేసి... ఢిల్లీ వీధుల్లో చంద్ర‌బాబు డ్రామా

Advertiesment
agriculture minister
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (15:06 IST)
రైతు భరోసా కింద ఇప్ప‌టి వ‌ర‌కు 18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నార‌ని చెప్పారు. 
 
కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నార‌ని,  రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి అని ప్ర‌శ్నించారు. కేంద్ర బీజేపీ నాయ‌కుల‌ను మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా? అని ప్ర‌శ్నించారు.
 
రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే, నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?  దిగజారుడు రాజకీయాలు చేసి, ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా? ఇది పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా? పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి అని క‌న్న‌బాబు హెచ్చ‌రించారు. 
 
ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా? చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్‌ అయ్యారు. 
 
ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింద‌న‌నారు. చెప్పిన మాట చెప్పినట్లుగా చేస్తున్న ప్రభుత్వం త‌మ‌ద‌ని, ఇంత సంక్షోభంలోనూ ప‌థ‌కాల‌ను అమలు చేయడం సామాన్యమైన విషయం కాద‌న్నారు.  టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే, టీడీపీవారు తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ టైంలో అస్సలు ఆ మాటెత్తకూడదు.. పాకిస్థాన్ ప్రధాని