Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో పడకసుఖం - భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య..?

వివాహేతర సంబంధం ఎంతటికైనా దారితీస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. పెళ్ళయిన తరువాత కూడా ప్రియుడ్ని మరిచిపోలేని ఒక మహిళ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా వస్తున్న భర్తను చంపేసింది. విశాఖ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Advertiesment
Affair
, బుధవారం, 5 సెప్టెంబరు 2018 (21:11 IST)
వివాహేతర సంబంధం ఎంతటికైనా దారితీస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. పెళ్ళయిన తరువాత కూడా ప్రియుడ్ని మరిచిపోలేని ఒక మహిళ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డుగా వస్తున్న భర్తను చంపేసింది. విశాఖ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
విశాఖజిల్లా చోడవరం మండలం అడ్డరూటుకు చెందిన షేక్ సయ్యద్, షేక్ ఫనీదకు సంవత్సరం క్రితం వివాహమైంది. షేక్ ఫనీదకు వివాహం కాకముందే నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఉండేది. పెళ్ళయిన తరువాత కూడా నాగరాజుతో ప్రేమాయణం సాగించింది. ప్రియురాలితో మరింత దగ్గరయ్యేందుకు ఆమె భర్తతో స్నేహం చేయడం ప్రారంభించాడు నాగరాజు. షేక్ సయ్యద్‌కు ఒక మటన్ షాపు పెట్టించి అతనికి సహాయపడేటట్లుగా నటించాడు. కానీ తన భార్యతో మాత్రం శృంగారంలో మునిగి తేలేవాడు.
 
మూడు నెలలుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగినా రెండు రోజుల క్రితం భర్తకు అసలు విషయం తెలిసిపోయింది. దీంతో భార్యను, నాగరాజును మందలించాడు షేక్ సయ్యద్. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడన్న కోపంతో రాత్రి నిద్రిస్తున్న సయ్యద్‌ను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికింది భార్య. అది కూడా తన భర్త షాపుకు ఉపయోగించే మటన్ కత్తితోనే. నిందితురాలితో పాటు నాగరాజు ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్