Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేక్ ఫెయిల్ - కొండపై నుంచి పల్టీలు కొట్టిన పెళ్లి బృదం ట్రాక్టర్... ఎక్కడ?

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (12:12 IST)
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఘోరం జరిగింది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరిన పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ ఘోరం జరిగింది. 
 
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
కాగా, మృతులు గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ్ముడు ప్రేమ.. అన్న హత్యకు దారితీసింది.. ఎలా?