Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు గిడుగు జయంతి: తెలుగు మాతృభాషా దినోత్సవం!

Advertiesment
గిడుగు రామ్మూర్తి
తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని రాష్ట్ర పజలు జరుపుకుంటున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు 147వ జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. విశిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు.

ఆ తర్వాత ఏవీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేయడం ఆరంభించారు. ఇందుకోసం ఆయన తెలుగు అనే పత్రికను గిడుగు ప్రారంభించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu