Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపు సామాజిక వర్గాన్ని నట్టేట ముంచుతున్న సీఎం : ఆది

Advertiesment
చిరంజీవి
, మంగళవారం, 6 మార్చి 2012 (16:19 IST)
FILE
సినీ నటుడు చిరంజీవిని అడ్డుపెట్టుకుని కాపు సామాజిక వర్గం మొత్తాన్ని నట్టేట ముంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రపన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆరోపించారు. ఇందులోభాగంగానే కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్‌ను పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై ఆదికేశవులు నాయుడు స్పందిస్తూ... చిరంజీవిని ముందుపెట్టుకుని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ధ్వజమెత్తారు.

మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌ను పక్కన కూర్చోబెట్టారని ఆదికేశవులు ఆరోపించారు. చిరంజీవికి ఏదో చేస్తున్నట్లు మా సామాజికవర్గం మొత్తాన్ని నడివీధిలో వదిలేశారని ఆయన అన్నారు. ఈ ముఖ్యమంత్రి చేస్తుంది ఏంటని ఆయన ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu