Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తెదేపాకు అభ్యర్థులు కావాలి!!

Advertiesment
ఉప ఎన్నికలు
, శనివారం, 17 డిశెంబరు 2011 (10:42 IST)
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి త్వరలో జరుగున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలో మరీ అధ్వాన్నంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానానికి, నిజమాబాద్ జిల్లా కామారెడ్డి సెగ్మెంట్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు.

నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలోకి దిగనున్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని ఎదుర్కొని ఢీకొనేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఈ రెండు స్థానాలతో పాటు.. గుంటూరు జిల్లా పత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, వెస్ట్ గోదావరి జిల్లాలోని నర్సాపురం స్థానాలకు కూడా అభ్యర్థులు చిక్కడం లేదు.

ఈ స్థానాలతో పాటు.. ఉప ఎన్నికలు జరుగనున్న మరికొన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. ఈ స్థానాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు నియోజకవర్గంపై పెద్దగా పట్టు లేకపోవడంతో వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత వెనుకంజ వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu