ఇపుడంతా ఫ్యాషన్గా పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కానీ అరటి ఆకు, మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు వున్నాయని వైద్యులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram
అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని పెద్దలు, వైద్యులు చెబుతున్నారు.
credit: Instagram
ఆకుపచ్చని అరటి ఆకులో వేడి వేడి పదార్థాలను వేసుకుని భుజించటం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి.
credit: Instagram
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యం చక్కబడి, శరీరానికి మంచి కాంతి వస్తుంది.
credit: Instagram
పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది.
credit: Instagram
మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటారు.
credit: Instagram
మర్రిచెట్టు ఆకులలో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.