రాగి పాత్రలకు అంత పవర్ వుందా? రాగి చెంబులో నీటిని తాగితే?

పూర్వకాలంలో మన పెద్దలు రాగిపాత్రల్లో ఆహారాన్ని భుజించేవారు. రాగి చెంబులు, గ్లాసుల్లో నీటిని తాగేవారు. రాగి పాత్రలు వాడటం వలనే వారి ఆరోగ్యం భేషుగ్గా ఉండేదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. రాగి పాత్రలతో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.

credit: social media

రాగి పాత్రలో 3 గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది.

ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారుచేస్తారు. జింక్ వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

అధిక బ‌రువు సమస్య త‌గ్గి గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి.

థైరాయిడ్ గ్రంధి ప‌నితీరు మెర‌గ‌వుతుంది, ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

అలాగే, ఇత్తడి పాత్రల్లో నీటిని తాగొచ్చు, ఆ పాత్రల్లో చేసిన వంట తినడం చాలా మంచిది.

అందుకే పెద్దలు అంత ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు జీవించారని నిపుణులు చెబుతున్నారు.

మతిమరుపును మాయం చేసే ఫుడ్ ఐటమ్స్, ఏంటవి?

Follow Us on :-