ఉదయం పూట గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే?

ఉదయం పూట గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొంచం నిమ్మరసం కలుపుకొని తాగితే పలు ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

credit: Instagram

ఉద‌యాన్నే గ్లాసు గోరువెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి.

ఈ నీటితో గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపిన నీటిని తాగితే తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

ఇందులో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌కశ‌క్తి పెరుగుతుంది.

బ్యాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు దరిచేరవు, జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

శ‌రీర మెటబాలిజం పెరుగి కొవ్వు క‌రిగిపోతుంది. అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు.

చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచే ఉత్తమ ఆహారాలు ఇవే

Follow Us on :-