Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18న శర్వానంద్ - దిల్ రాజుల 'శతమానం భవతి' ఆడియో విడుదల

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరో

18న శర్వానంద్ - దిల్ రాజుల 'శతమానం భవతి' ఆడియో విడుదల
, సోమవారం, 12 డిశెంబరు 2016 (22:47 IST)
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.
 
ఈ చిత్రం ఆడియోని ఈ నెల 18న హైదరాబాద్‌లో వైభవంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. 
 
"శతమానం భవతి తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 18 న ఆడియోను విడుదల చేస్తున్నాము. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆడియోని అందించారు. జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గుంటూరోడు' టీజర్ రిలీజ్... సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న : మంచు మనోజ్