World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (14:32 IST)
బెర్లిన్‌లో నిర్వహించిన వరల్డ్ హెల్త్‌ సమ్మిట్‌-2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్‌ నిలిచారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ వారి వైద్యం కోసం సరిపడినన్ని నిధులు ఉండటం లేదన్నారు. 
 
మహిళల ఆరోగ్యంతోపాటు లింగ సమానత్వం కోసం అధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యమనేది తేలిగ్గా తీసుకునే అంశం కాదని, మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం లాంటిదని పేర్కొన్నారు. 'ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌' ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి సెప్టెంబరులో ఎంపికైన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే, కృతి సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌ హీరో ధనుష్‌ సరసన ఆమె నటించిన ‘తేరే ఇష్క్‌ మే’ అనే హిందీ చిత్రం, ఈ ప్రేమకథా చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకురానుంది. షాహిద్‌ కపూర్‌తో కలిసి కృతి నటిస్తున్న ‘కాక్‌టెయిల్‌ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments