కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

ఠాగూర్
గురువారం, 13 నవంబరు 2025 (18:45 IST)
తెలంగాణ మంత్రి కొండా సురేఖ - హీరో అక్కినేని నాగార్జునల మధ్య జరిగిన వివాదం టీ కప్పులో తుఫానులా ముగిసిపోయింది. కొండా సురేఖ ఓ మెట్టుదిగి వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు అక్కినేని నాగార్జునపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీంతో నాగార్జున కూడా శాంతి తన కేసును విత్ డ్రా చేసుకున్నారు. 
 
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకుగాను తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా వేసిన విషయం తెల్సిందే. నాగచైతన్య - సమంత విడాకులు అవ్వడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని గతంలో కొండ సురేఖ కామెంట్ చేశారు. 2024 అక్టోబరు 2 హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్‌లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ కామెంట్స్ రాజకీయాల్లో అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ హీరో నాగార్జున మంత్రి కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖ పై బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే రెండు సార్లు సోషియల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పిన కొండ సురేఖ తాజాగా మరోమారు బహిరంగ క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున తన కేసును విత్‌డ్రా చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments