చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (14:47 IST)
మెగాస్టార్ చిరంజీవిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు కోరారు. దీనికి కారణం లేకపోలేదు. ఆర్జీవీ తెరకెక్కించిన తొలి చిత్రం శివ. అక్కినేని నాగార్జున - అమల హీరోహీరోయిన్లు. 36 యేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. ఇపుడు మళ్లీ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి విషెస్ చెపుతూ ఓ వీడియోను షేర్ చేశారు. 
 
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. 'థాంక్స్‌ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీమ్‌ని విష్‌ చేసింనందుకు మరోసారి కృతజ్ఞతలు' అని ట్వీట్‌ చేశారు. 
 
అయితే, చిరంజీవికి వర్మ సారీ చెప్పడానికి కారణమేంటన్నది చెప్పకపోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆగిపోయిన ప్రాజెక్టును అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. చిరంజీవి హీరోగా ఆర్జీవీ 'వినాలని ఉంది' అనే సినిమా తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే.
 
కాగా, శివ చిత్రం రీ రిలీజ్‍‌పై చిరంజీవి స్పందిస్తూ, 'శివ' చూసి నేను ఆశ్చర్యపోయా. అది సినిమా కాదు ఓ విప్లవం. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆ మూవీలో హీరో సైకిల్‌ చైన్‌ లాగే సీన్‌ ఎప్పటికీ మరిచిపోలేనిది. నాగార్జున యాక్టింగ్‌ ఫెంటాస్టిక్‌. అమల, రఘువరన్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం మంచి ప్రయత్నం. 
 
ఈ సినిమా విషయంలో రామ్‌గోపాల్‌ వర్మ విజన్‌ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కెమెరా యాంగిల్స్‌, లైట్స్‌ అండ్‌ సౌండ్స్‌ వావ్‌ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే నాకు అనిపించింది. హ్యాట్సాఫ్‌ టూ రామ్‌గోపాల్‌ వర్మ. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే : సీఎం చంద్రబాబు

తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు

పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్.. ఆయన ఫ్యామిలీకి రేవంత్ చోటు లేకుండా చేశారు : జగదీశ్ రెడ్డి

మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం ఉంది.. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే చనిపోయినట్టు ప్రకటించారు : తల్లి మహానంద

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో విధ్వంసం సృష్టించారు.. బీహార్ ఓటర్లకు మంత్రి లోకేశ్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments