Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఐ' ఆడియో వేడుక వేదికపై జాకీ చాన్, చిరంజీవి, కేసీఆర్!?

'ఐ' ఆడియో వేడుక వేదికపై జాకీ చాన్, చిరంజీవి, కేసీఆర్!?
, సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:22 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఐ'. ఈ చిత్రం తెలుగు ఆడియో వేడుక వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ నటుడు జాకీ చాన్, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇందుకోసం టాలీవుడ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ప్రయత్నాలు ఫలిస్తే.. తమిళ నటుడు విక్రం, అమీ జాక్సన్‌లు జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ’ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో ఈ అద్భుతం చోటుచేసుకోనుంది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న తమ ఆహ్వానానికి జాకీచాన్ నుంచి రెండు రోజుల్లోగా సానుకూల స్పందన రానుందని ‘ఐ’ తెలుగు వెర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu