2010లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న నేహ హింజ్ టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. 'లవ్ యూ సోనియా' అనే సినిమా ద్వారా బాలీవుడ్కి పరిచయమైన నేహ.. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (రాజన్న ఫేం) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అప్పుడే ఓ షెడ్యూల్ కూడా చేసేసింది.
ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. "గత నెలలో ఓ రోజు ఫోన్ వచ్చింది. డైరెక్టర్ గారు ఓ కథ చెప్పాలనుకుంటున్నారని, హైదరాబాదు రమ్మనీ అడిగారు. వెంటనే వెళ్లాను. నన్ను చూడగానే ఆయన సెలెక్ట్ చేసేశారు. ఈ సినిమాలో ఎన్నారై యువతిగా నటిస్తున్నాను" అని నేహ వెల్లడించింది.