పెళ్ళికి ముందు సెక్స్ తప్పుకాదంటూ దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కుష్బు ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకుంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉండే నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ మరో వివాదంలో చిక్కుకుంది.
ఇటీవల రాజనీ రాజకీయ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈమె ప్రస్తుతం ఎల్టీటీఈలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఎల్టిటిఈ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఇవేమీ పట్టని ఖుష్బూ మాత్రం ఎల్టిటిఈని తీవ్రవాదులతో పోల్చుతూ వ్యాఖ్యానించింది. దాంతో అక్కడున్న తమిళ సంఘాలన్నీ తీవ్ర ఆగ్రహావేశాలు చెందాయి. కుష్బూ చేసిన వ్యాఖ్యలు తమిళుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉన్నాయని, కనుక వెంటనే ఆమెని క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి.
టాలీవుడ్లో ఎప్పుడూ ఏదొక కామెంట్ చేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటున్న రాంగోపాల్ వర్మ బాటలో కుష్బూ నడుస్తుందేమో. మరి ఎల్టీటీఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి..!