మెగాస్టార్గా పిలుచుకునే చిరంజీవి.. రాజకీయాలకు దూరమై... ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కాకుండా.. తన 150వ సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. దానికి సంబంధించి పలువురు రచయితలు కథలు కూడా ఇచ్చారు. కానీ ఏది ఫైనల్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. ఇటీవలే బివిఎస్ రవి అనే రచయిత కథ ఇచ్చాడని తెలిసింది. ఇది ఇంతవరకు ఆయన 150 చిత్రంపై నడుస్తున్న వ్యవహారం.
కానీ, నిన్న దాసరి ప్రకటనతో ఒక్కసారి చిరు సినిమా మరుగునపడిపోయినట్లయింది. ఇప్పుడంతా ఎక్కడ చూసినా పవన్, దాసరి కాంబినేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి దర్శకుడు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. వినాయక్ అనుకున్నారు. ఆయన కూడా తాను చేయట్లేదని ఇటీవలే తెలియజేశారు. మరి చిరంజీవే దర్శకత్వం వహిస్తాడని కొందరు భావిస్తున్నారు.
గతంలో తాను దర్శకత్వం వహించే అవకాశం లేకపోలేదని ఓ సందర్భంలో చిరంజీవి వ్యాఖ్యానించారు. పేరు చిరంజీవి అయినా.. ఆయన వెనుక ఓ ప్రముఖ దర్శకుడు నడిపిస్తాడని కొందరు చెపుతున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాలో తన కుటుంబ హీరోలను కూడా నటింపజేయాలనే కథలో భాగంగా పెట్టాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రకారం చిరు తన 150వ సినిమాలో పవన్ కళ్యాణ్ను కూడా నటింపజేస్తారా... అసలు చిరు ప్లాన్ ఏంటో చూడాల్సిందే.