Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో ఓటు వేశా.. మీరు వేశారా : సచిన్ ట్విట్టర్ పోస్ట్

ముంబైలో ఓటు వేశా.. మీరు వేశారా : సచిన్ ట్విట్టర్ పోస్ట్
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:59 IST)
File
FILE
భారత క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తన 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ భార్య అంజలితో కలసి తన ఓటును వేశారు.

ముంబైలోని బాంద్రాలో, లీలావతి ఆస్పత్రి సమీపంలోని సుపారిటాకి పోలింగ్ బూత్‌కు భార్య అంజలితో కలసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సచిన్ వచ్చారు. వారు ఒకరి తర్వాత ఒకరు ఓటేశారు. ఆ తర్వాత సచిన్ 'నేను ఓటేశా.. మరి మీరు?' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన వేలిపై ఇంక్ గుర్తున్న ఫొటోను కూడా ట్విట్టర్లో పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu