Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైకు మరో ఓటమి : రాయల్ చాలెంజర్స్ విజయం!

ముంబైకు మరో ఓటమి : రాయల్ చాలెంజర్స్ విజయం!
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (12:24 IST)
File
FILE
ఐపీఎల్-7 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఖంగుతిన్న ముంబై జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని చవి చూసింది.

అదే చెత్త బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది. మరోవైపు స్పిన్నర్ యువేంద్ర చాహల్ (4-0-17-2) మరోసారి స్పిన్ మ్యాజిక్ ప్రదర్శించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన గెలుపు జోరును కొనసాగిస్తోంది.

శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన‌లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు.. పార్థివ్ పటేల్ (45 బంతుల్లో 7 ఫోర్లతో 57 నాటౌట్), ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్) అజేయంగా రాణించడంతో 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Share this Story:

Follow Webdunia telugu