Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సచిన్ టెండూల్కర్!

ముంబై జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సచిన్ టెండూల్కర్!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (11:42 IST)
File
FILE
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టాడు. దుబాయ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమైన ఐపీఎల్ ఏడో అంచె పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు మద్దతుగా అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ముంబై జట్టు బస చేసిన హోటల్‌లోనే సచిన బస చేస్తున్నాడు.

అయితే, ఆ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అరగంట సేపు బ్యాటింగ్ చేసిన దిగ్గజం తనలో వాడి తగ్గలేదని చూపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ టోర్నీల్లో కనిపించని ఈ క్రికెట్ దిగ్గజం ప్రకటించిన విషయం తెల్సిందే.

ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో కలిసి ఈ దిగ్గజ ఆటగాడు ప్రాక్టీస్ చేశాడు. జట్టు సహాయక సిబ్బందితో త్రోలు వేయించుకుని అరగంట బ్యాటింగ్ చేశాడు. తర్వాత పోలార్డ్, రోహిత్ శర్మల బ్యాటింగ్ విధానం గమనించి వారికి సలహాలు ఇచ్చాడు.

కోచ్ జాన్ రైట్, కెప్టెన్ రోహిత్ శర్మ‌తో ప్రణాళికల గురించి చర్చించాడు. కుంబ్లేతో సుదీర్ఘంగా చర్చించిన సచిన్ మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకుని గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ ఓ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu