భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్లు : జాంటీ రోడ్స్
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:37 IST)
భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చారు. టీమిండియాలో బంతిని ఆపేందుకు సమర్ధవంతంగా డైవ్ చేయగల ఫీల్డర్లు లేరని ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించిన అలనాటి దక్షిణాఫ్రికా మేటి ఫీల్డర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. భారత జట్టులో ప్రస్తుతం అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారని, ఫీల్డింగ్ విభాగంలో వీరు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారని ఆయన ప్రశంసించాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం విదితమే.