Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాషెస్ ఆఖరు టెస్టు డ్రా... సిరీస్‌ను నెగ్గిన ఇంగ్లండ్!

యాషెస్ ఆఖరు టెస్టు డ్రా... సిరీస్‌ను నెగ్గిన ఇంగ్లండ్!
, సోమవారం, 26 ఆగస్టు 2013 (10:21 IST)
FILE
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ చివరి టెస్టు చాలా ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠలో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ చేతిలో మరో ఐదు వికెట్లు, నాలుగు ఓవర్లు మిగిలివున్న దశలో విజయానికి కేవలం మరో 21 పరుగులు అవసరమవుతాయన్న స్థితిలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఆటకొనసాగివుంటే ఇంగ్లండే గెలిచేది.

ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 247/తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 377 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 111/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ఎదుట 227 పరుగుల లక్ష్యాన్నుంచింది. ఐదోరోజు ఆటలో 447 పరుగులు నమోదయ్యాయి. టెస్టు క్రికెట్ చరివూతలోనే ఇదో రికార్డు. ఈ టెస్టు డ్రాతో యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో కైవసం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu