Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి యాదగిరిగుట్ట నరసింహ బ్రహ్మోత్సవాలు!!

నేటి నుంచి యాదగిరిగుట్ట నరసింహ బ్రహ్మోత్సవాలు!!
, సోమవారం, 3 మార్చి 2014 (09:12 IST)
File
FILE
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 11 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలు సోమవారం ఉదయం స్వస్తివాచకంతో ఆరంభమవుతాయి. ఇందులోభాగంగా రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇక రెండో రోజు ధ్వజారోహణం జరుగుతుందని, మూడో రోజు నుంచి అలంకార వేడుకలకు శ్రీకారం జరుగుతుందని ఆలయ ఈవో కృష్ణవేణి వెల్లడించారు. విశేష పర్వాల్లో మార్చి 9న ఎదుర్కోలు ఘట్టాన్ని, 10వ తేదీ రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, 11వ తేదీన రథోత్సవం నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.

మార్చి 13న జరిగే శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను కల్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu