ఖమ్మం జిల్లా భద్రాచలంలో కొలువున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి పదో తేదీన ప్రారంభం కానున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 20 తేదీ వరకు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
సర్వధారి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్చి ఏడో తేదీన మూలవ రుల ప్రత్యేకాభిషేకం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. స్వామి వారి కల్యాణం మార్చి 14వ తేదీన మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపంలో జరుపనున్నట్టు వెల్లడించారు.