దక్షిణ ఢిల్లీలో యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (12:04 IST)
దక్షిణ ఢిల్లీలో మరో యువతిపై అత్యాచారం జరిగింది. జిమ్లో శిక్షణ కోసం వెళ్లిన ఓ యువతిపై ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరోగ్యం కోసం, శారీరక సౌష్టవం కోసం జిమ్లో వ్యాయామాలు చేద్దామని వెళ్ళినందుకు ఆ యువతి అన్యాయానికి గురైంది. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్కు చెందిన 30 ఏళ్ల ఓ మహిళా వ్యాపారి కొన్ని నెలల క్రితం స్థానికంగా ఓ జిమ్లో చేరింది. జిమ్ నిర్వాహకుడు తరుణ్ ఆమెకు శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల ఓ రోజు శిక్షణ కోస జిమ్కు వెళ్లిన ఆమెకు తరుణ్ మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమెకు లోకం తెలియకుండా పోయింది. ఆ సమయంలో తరుణ్ ఆమెపై అత్యాచారం చేశాడు. స్పృహ వచ్చాక ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడు తరుణ్ను అరెస్ట్ చేశారు.