Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంగానది నన్ను వారణాసికి రమ్మంది : నరేంద్ర మోడీ

గంగానది నన్ను వారణాసికి రమ్మంది : నరేంద్ర మోడీ
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:20 IST)
File
FILE
పవిత్ర గంగానది వారణాసికి రమ్మని తనను పిలిచిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన గురువారం వారణాసిలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చుతానని మోడీ ప్రకటించారు. గంగామాత తనను కాశీకి రమ్మని ఆహ్వానించిందన్నారు. అందువల్లే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తనకు వారణాసి వాసుల ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని మోడీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu