Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తా : మోడీ

వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తా : మోడీ
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:49 IST)
File
FILE
భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చుతానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆయన గురువారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

ఇందుకోసం ఉదయాన్నే వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగామాత తనను కాశీకి రమ్మని ఆహ్వానించిందన్నారు. అందువల్లే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తనకు వారణాసి వాసుల ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని మోడీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu