Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో ఓటేసిన రజనీకాంత్ ... ముంబైలో విద్యాబాలన్

చెన్నైలో ఓటేసిన రజనీకాంత్ ... ముంబైలో విద్యాబాలన్
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:44 IST)
File
FILE
ప్రముఖ తమిళ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన ఓటు హక్కును చెన్నై, పోయస్ గార్డెన్‌కు సమీపంలోని స్టెల్లా మేరిస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఇక్కడే ముఖ్యమంత్రి జయలలిత కూడా ఓటు వేశారు.

ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సూచన చేశారు. అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ ప్రజలకు, తన అభిమానులకు సూచించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు ఈ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. అక్కడి మేరీ స్టెల్లా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే, రజనీకాంత్ ఓటు వేశారు. అనంతరం కమల్ హాసన్, రేవతి ఓటు వేయగా... నటి కుష్బూ క్యూలైన్‌లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు వేశారు. ప్రస్తుతం ఆరో దశ పోలింగ్ ప్రశాతంగానే సాగుతోంది.

అలాగే, సినీ నటి విద్యాబాలన్‌ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాక, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu