Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త నల్లగా ఉన్నాడనీ కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య!!

భర్త నల్లగా ఉన్నాడనీ కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య!!
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (12:06 IST)
File
FILE
పచ్చ తోరణాలు, వేదమంత్రాల మధ్య అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త నల్లగా ఉన్నాడనీ, ఈ రంగు తనకు నచ్చలేదని, నల్లరంగు కలిగిన భర్తతో కాపురం చేయలేనంటూ కట్టుకున్న భర్త శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది ఓ భార్య. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకోగా, గురువారం వెలుగు చూసింది.

24 ఏళ్ల చమేలీదేవి అనే మహిళ జాగ్రామ్ రాథోడ్ అనే వ్యక్తితో పెద్దలు వివాహం చేశారు. అయితే, కట్టుకున్న భర్త శరీర రంగు నల్లగా ఉందని, ఇది తనకు నచ్చలేదు. దీంతో భర్త నిద్రిస్తుండగా అతడిపై కిరోసిన్ పోసి నిప్పటించింది. ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

భార్యే తనపై హత్యాయత్నం చేసిందని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. చమేలీకి తమ కొడుకు నల్లగా ఉండడం నచ్చలేదని జాగ్రామ్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఒత్తిడితోనే చమేలీ పెళ్లి చేసుకుందని వెల్లడించారు. ఎట్టకేలకు పరారీలో ఉన్న చమేలీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu