Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాయ్ అమ్మాను.. దేశాన్ని అమ్మలేదు : నరేంద్ర మోడీ

చాయ్ అమ్మాను.. దేశాన్ని అమ్మలేదు : నరేంద్ర మోడీ
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:00 IST)
File
FILE
నేను చిన్నతనంలో చాయ్ అమ్మిన మాట నిజమేనని, కానీ, దేశాన్ని తెగనమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా హార్దోయ్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

దేశంలో పేదలను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తాను చాయ్ అమ్ముకున్నాను కానీ... దేశాన్ని కాదని ఆయన ఎద్దేవా చేశారు. పేదలను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని మోడీ మండిపడ్డారు.

దేశంలో అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అధికారం అప్పగిస్తే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెపుతారని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu