Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలులు బీభత్సం... 27మంది మృతి!

ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలులు బీభత్సం... 27మంది మృతి!
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (09:21 IST)
FILE
ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం జల్లులతోపాటు సుడిగాలులు బలంగా వీచడంతో 27మంది మరణించగా, 30మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని లక్నోతో సహా పలు ప్రధాన నగరాల్లో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, గోడలు నేలకొరిగాయి.

ఈ ఘటనవో ప్రాణనష్టంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం సంభవించింది. వాతావారణంలో ఏర్పడిన అనూహ్య మార్పుల వల్ల వర్షపు జల్లులతో పెనుగాలులు వీచాయని అధికార్లు చెబుతున్నారు. చెట్లు, ఇంటి గోడలు కూలడంతో ఫరూఖాబాద్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో భీతావహ వాతావరణం ఏర్పడి పదిమంది ప్రాణాలు కోల్పోయారు.

బారాబంకీ, లక్నోలోనూ గోడలు కూలిపోవడం వల్లే మరికొందరు మృత్యువాత పడ్డారు. ఆస్తినష్టం గురించి మరికొన్ని ప్రాంతాల నుంచి సమాచారం అందాల్సి ఉందని పోలీసు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu