Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరికి ఓటేసినా కాంగ్రెస్‌కే... వాస్తు సరిగాలేదని ఈవీఎం మార్పు!

ఎవరికి ఓటేసినా కాంగ్రెస్‌కే... వాస్తు సరిగాలేదని ఈవీఎం మార్పు!
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (11:52 IST)
FILE
ఈవీఎం పెట్టిన చోట వాస్తు సరిగా లేదంటూ కేంద్రమంత్రి, కోలారు నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి కె. హెచ్. మనియప్ప ఏకంగా దాని దిక్కునే మార్పించేశారు. హారోహళ్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన గురువారం వెళ్లారు. అక్కడ ఓటింగ్ యంత్రం దక్షిణం వైపువుంది. అక్కడ ఎన్నికల సిబ్బంది దాన్ని తూర్పు దిక్కుకు మార్చిన తర్వాత ఆయన ఓటు వేశారు.

ఎవరికి ఓటేసినా కాంగ్రెస్‌కే:

ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ పార్టీకే వేసినట్లు ఈవీఎం చూపడంతో ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూణేలోని గురువారం జరిగిన పోలింగ్‌లో ఈ సంఘటన జరిగింది. పూణేలోని శ్యామ్‌రావు కల్మాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈవీఎంలో ఏ మీట నొక్కినా కాంగ్రెస్ గుర్తు ఉన్న లైటే వెలుగుతోంది. ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అవుతుండడాన్ని గమనించిన ఓటర్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎంలో లోపం వల్లే అలా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు తక్షణమే ఆ యంత్రంతో ఓటింగ్ నిలిపివేశారు. కొత్త ఈవీఎం ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. అప్పటికే ఓటేసిన 28మంది మళ్లీ ఓటోసేందుకు అనుమతించారు.

Share this Story:

Follow Webdunia telugu