Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీని మరో గుజరాత్ కానవ్వబోం: సమాజ్‌వాది పార్టీ సమర్థింపు

యూపీని మరో గుజరాత్ కానవ్వబోం: సమాజ్‌వాది పార్టీ సమర్థింపు
FILE
విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన కోసీ పరిక్రమ యాత్రపై ఉత్తర ప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఉత్తరప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరో గుజరాత్‌ను కానివ్వబోమని ఉద్ఘాటించారు.

అలాగే బాబ్రీ మసీదు విధ్వంసం నాటి పరిస్థితులు పునరావృతం కావడానికీ ఆస్కారం ఇచ్చేది లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతఅన్నారు. విహెచ్‌పి యాత్రను నిరోధించడం ద్వారా మరో సంఘర్షణను తాము నివారించగలిగామని తెలిపింది.

మత విద్వేషాలను రగిలించడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా ప్రతిఘటించి తీరుతామని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ స్పష్టం చేశారు. విహెచ్‌పి వలలో పడకుండా రాష్ట్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu