Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమారుడి పెళ్లి కోసం నాలుక కోసుకున్న మహిళ

కుమారుడి పెళ్లి కోసం నాలుక కోసుకున్న మహిళ
తన కుమారుడికి వివాహం జరగాలని ఓ వివాహిత మహిళ భవంతుని సాక్షిగా తన నాలుకను కోసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ విభ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. తన తనయుడి వివాహం త్వరగా జరగేలా భగవంతుడు తనని ఆశీర్వదించాలని ఆమె ఈ చర్యకు పాల్పడింది.

లక్నోలోని బరాఫ్‌ఖానాకు చెందిన సాధనా దేవి అనే 55 ఏళ్ల మహిళ తన కుమారుడికి త్వరలోనే వివాహం కుదరాని చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయంలోకి వెళ్లి తన నాలుకను కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన అనంతరం ఆమె స్పృహ కోల్పోవడంతో.. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మాతృ ప్రేమకు అద్దం పట్టిన ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది.

Share this Story:

Follow Webdunia telugu