Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధరల పెరుగుదలపై ఈనెల 24న ఢిల్లీలో బ్లాక్‌డే: భాజపా

ధరల పెరుగుదలపై ఈనెల 24న ఢిల్లీలో బ్లాక్‌డే: భాజపా
నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాష్ట్ర శాఖ ఈనెల 24వ తేదీన బ్లాక్‌డేను పాటించాలని నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీని నాయకత్వం వహిస్తారని భాజపా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా వెల్లడించారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్య విధానాల కారణంగానే నానాటికీ ధరలు పెరుగుతున్నాయని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు వంద శాతం పెరిగాయని విజయేంద్ర గుప్తా తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల సుంకాలు పెట్రోల్ ధరల పెరుగుదలకు పరోక్ష కారణమవుతున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu