Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమనాథ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం: బుద్ధదేవ్

Webdunia
FileFILE
లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వంటి నేతలను తిరిగి సీపీఎం పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వ్యక్తిగత ప్రయత్నాలు చేపట్టారు. సొంత మార్గాలలో సోమనాథ్ వంటి నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బుద్ధదేవ్ ఆదివారం వెల్లడించారు.

సోమనాథ్ పార్టీకి దూరమవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓ స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుద్ధదేవ్ మాట్లాడుతూ.. సోమనాథ్ వంటి నేతలను దూరం చేసుకోవడం తమను బాధిస్తోందని చెప్పారు. సీపీఎం ఏడాది క్రితం పార్టీ నుంచి సోమనాథ్ చటర్జీ, మాజీ ఎంపీ సైపుద్దీన్ చౌదరీలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరినీ పార్టీలోకి తిరిగి తేవడం సాధ్యపడుతుందా అని అడిగిన ప్రశ్నకు బుద్ధదేవ్ సమాధానమిస్తూ.. ఎవరూ ఒంటిరిగా పార్టీని తయారు చేయలేరు. అనేక మంది వ్యక్తుల కలయికే పార్టీ. తాను ఇంతవరకు చెప్పగలను. వారిని తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు వ్యక్తిగత ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపారు.

ఇద్దరు నేతలను తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా లేదా చటర్జీని మాత్రమే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు తాను స్పష్టంగా ఏమీ చెప్పలేనన్నారు. తన సహచరులతో ఢిల్లీ, కోల్‌కతాలలో ఈ విషయంపై మాట్లాడానని బుద్ధదేవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫర్ డెమొక్రటిక్ సోషలిజం (పీడీఎస్)ను స్థాపించిన చౌదరి తాను తిరిగి సీపీఎంలో చేరడంపై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments