Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీర్ లీడర్స్‌ ఆటాపాటలపై కేంద్రం సీరియస్

చీర్ లీడర్స్‌ ఆటాపాటలపై కేంద్రం సీరియస్
, బుధవారం, 30 ఏప్రియల్ 2008 (21:09 IST)
బీసీసీఐ ఏర్పాటు చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు మరో వివాదంలో చిక్కుకున్నాయి. తమకు ఇష్టమైన ఆటగాళ్ళను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలను గుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. ఆటగాళ్లను క్రికెట్ స్టేడియాలకు రప్పించేందుకు సరికొత్త జిమ్మిక్కులను అనుసరిస్తున్నాయి.

ఇందులోభాగంగా చీర్ లీడర్స్‌ను ఫ్రాంఛైజీలు రంగంలోకి దించి నృత్యాలు చేయిస్తున్నాయి. వీటిపై కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ముంబైలో జరిగే మ్యాచ్‌లలో చీర్ లీడర్స్ ఆటాపాటలపై నిషేధం విధించింది. ఇదిలావుండగా తాజా కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాస్ మరో కొత్త పాయింట్ అందుకున్నాడు.

జట్ల పేర్లకు మద్యం పేర్లను పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది మరో రకంగా మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడమేనని రామదాసు అభిప్రాయపడ్డారు. దీనిపై ఐపీఎల్ తక్షణం స్పందించింది. మద్యం పేరును కాకుండా క్రికెట్‌ను ఆస్వాదించేందుకు స్టేడియాలకు రావాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా తమ మ్యాచ్‌లకు సుప్రీం కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu