Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుద్ధగయ పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

బుద్ధగయ పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే
, ఆదివారం, 7 జులై 2013 (17:30 IST)
File
FILE
బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ళను శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ పేలుళ్ళ ఘటనకు సంబంధించి తాను ఆలయ అధికారులతో మాట్లాడారు. అలాగే, ఈ పేలుళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలను చేరవేయాల్సిందిగా శ్రీలంక హైకమిషన్‌లకు చెందిన అధికారులను కోరినట్టు చెప్పారు.

గౌతమబుద్ధునికి జ్ఞానోదమైన ప్రాంతమే ఈ బుద్ధగయ. ఈ ప్రాంతానికి శ్రీలంక దేశస్థులు భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపును సంతరించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu