Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చం: నిరుపమా

Webdunia
నేపాల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై నేపాల్ మావోయిస్టులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఖాట్మండుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేపాల్ రాజకీయాల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదని పదేపదే చెపుతున్నప్పటికీ ఆదేశ మావోయిస్టులు మాత్రం నేపాల్ రాజకీయాల పగ్గాలు భారత్‌ చేతుల్లోనే ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ వార్తలకు నేపాల్ మీడియా అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రసారం చేస్తోందని విమర్శించారు.

అయితే, నేపాల్‌ రాజకీయాలు, శాంతి ప్రక్రియ కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఖాట్మండ్‌కు చేరుకోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె పర్యటనకు నేపాల్ మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనిపై నిరుపమా రావు మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు తాను ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు.

నేపాల్‌ ప్రగతి, శాంతి, సుస్థిరతకు దోహదపడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ఇక్కడి రాజకీయ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉన్నట్లు ఆమె పునరుద్ఘాటించారు. నేపాల్‌తో సత్సంబంధాల కొనసాగింపునకే భారత్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments