Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేతలను ప్రశ్నించేందుకే పార్టీ పెట్టా : పవన్ కళ్యాణ్

నేతలను ప్రశ్నించేందుకే పార్టీ పెట్టా : పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:40 IST)
File
FILE
రాజకీయ నేతలను ప్రశ్నించేందుకు తాను పార్టీ పెట్టినట్టు హీరో పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన శుక్రవారం ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల తరపున రాజకీయ నేతలను ప్రశ్నించేందుకు జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. అలాగే, ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములేనని చెప్పారు.

ఇక ముందు కూడా సినిమాలు చేస్తా, రాజకీయాల్లో కూడా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చింది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలే అయినా, తెలంగాణ వచ్చింది మాత్రం ఇక్కడి యువకుల బలిదానాల వల్లేనని స్పష్టం చేశారు.

అంతేకాని, కేసీఆర్ చెప్పినట్టు టీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ అంటే తనకు ఇష్టం, గౌరవం అని ఆయన చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే తాను పెరిగినట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu