శోభానాగిరెడ్డి కారు డ్రైవర్ ఆస్పత్రి నుంచి అదృశ్యం!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:46 IST)
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆళ్ళగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, పోలీసులు మాత్రం అతని కోసం గాలిస్తున్నారు. శోభానాగిరెడ్డి మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నాగేంద్ర, గన్మెన్లు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ నాగేంద్ర నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో ఆసుపత్రి నుంచి నాగేంద్ర అదృశ్యమైపోయాడు. కనిపించకుండా పోయిన నాగేంద్ర గురించి అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన శోభా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని చూడాలని చెప్పి ఆస్పత్రిని బయటకు వచ్చిన వెంటనే అదృశ్యమయ్యాడు.