Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆళ్ళగడ్డ అసెంబ్లీకి యథాతథంగా ఎన్నికలు : ఎన్నికల సంఘం

ఆళ్ళగడ్డ అసెంబ్లీకి యథాతథంగా ఎన్నికలు : ఎన్నికల సంఘం
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:42 IST)
File
FILE
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుపనున్నట్లు సీఈసీ తెలిపింది.

సెక్షన్ 52 ప్రకారం ఈసీ గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు జరపవచ్చన్న నిబంధనకు అనుగుణంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో వైఎస్ఆర్ సీపీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కాగా, ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి ఇంటికి వెళుతూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం మరణించిన విషయం తెల్సిందే. దీంతో ఇక్కడ ఎన్నిక నిర్వహణపై తర్జనభర్జనలు పడిన అనంతరం చివరకు ఈసీ యథావిధిగా ఎన్నిక జరపాలని నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu