Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు వచ్చిందా.. : దిగ్విజయ్ పశ్న

కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు వచ్చిందా.. : దిగ్విజయ్ పశ్న
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:27 IST)
File
FILE
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు రెడ్ కార్నర్ నోటీసు వచ్చిందా అనే అంశం తనకు తెలియదని, దీనిపై తర్వాత స్పందిస్తానని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆయన గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజులు రాష్ట్రంలోనే ఉంటానని చెప్పారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగాలని కోరుకుంటున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామని దిగ్విజయ్ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu