Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ కంటే వ్యక్తిగత ఛరిష్మాతోనే శోభానాగిరెడ్డి విజయాలు!

పార్టీ కంటే వ్యక్తిగత ఛరిష్మాతోనే శోభానాగిరెడ్డి విజయాలు!
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (15:10 IST)
File
FILE
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన భూమా శోభానాగిరెడ్డి.. తమ కంచుకోట ఆళ్ళగడ్డలో పార్టీల ఇమేజ్ కంటే.. వ్యక్తిగత పేరు ప్రతిష్టలు, ఛరిష్మాతోనే ఆమె గెలుపొందుతూ వచ్చారు. అందువల్లే ఆమె ఏ పార్టీలో ఉన్నా మంచి పేరు తెచ్చుకున్నారు.

తొలుత టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఇపుడు వైఎస్ఆర్ సీపీ ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగింది. సినీ నటుడు చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పీఆర్పీ రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లోనూ పోటీ చేసింది.

అయితే, ఆ ఎన్నికల్లో రాయలసీమలో పీఆర్పీ తరపున ఒక్క శోభానాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన అభ్యర్థులు ఎవరూ గెలుపొందలేక పోయారు. రాయలసీమలో పీఆర్పీకి ఏమాత్రం పట్టులేకపోయినప్పటికీ... ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారు శోభనాగిరెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu