Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శోభానాగిరెడ్డి కన్నుమూత : ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదా?!!

శోభానాగిరెడ్డి కన్నుమూత : ఆళ్ళగడ్డ ఎన్నిక వాయిదా?!!
, గురువారం, 24 ఏప్రియల్ 2014 (12:56 IST)
File
FILE
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి (44) ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని గురువారం మధ్యాహ్నం 11.05 గంటలకు కన్నుమూశారు. దీంతో ఆమె పోటీ చేస్తున్న ఆళ్ళగడ్డ అసెంబ్లీ ఎన్నిక నిర్వహణపై ఇపుడు సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.

సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈసీ గుర్తింపు ఉన్న ఒక రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తూ అకాల మరణం చెందితే ఆ స్థానంలో జరిగే ఎన్నికలను వాయిదా వేయడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే, ఇక్కడ వైసీపీకి గుర్తింపు లేదు. దీంతో ఆళ్ళగడ్డ ఎన్నిక నిర్వహణపై సందిగ్దత నెలకొంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రదానాధికారి భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu