Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే రాజన్న రాజ్యమే : వైఎస్ షర్మిల

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే రాజన్న రాజ్యమే : వైఎస్ షర్మిల
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:14 IST)
File
FILE
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాజన్న రాజ్యం వస్తుందని వైఎస్ఆర్ సీపీ మహిళా నేత వైఎస్, షర్మిల అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా కల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం జగనన్న ఒక్కడే వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడని గుర్తు చేశారు.

రైతుల కోసం దీక్ష చేసింది కూడా జగనేనని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవిని సైతం వదులుకున్నాడన్నారు. జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమన్నారు. అందుకే జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని షర్మిల అన్నారు.

చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని షర్మిల విమర్శించారు. గత ఐదేళ్లలో ఏనాడైనా బాబు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారా? అని ఆమె ప్రశ్నించారు. విప్ జారీ చేసి మరీ కిరణ్ సర్కారును చంద్రబాబు కాపాడారని ఆమె ఆరోపించారు. పదవీ కాంక్షతో ఆయన అన్నీ ఫ్రీగా ఇస్తానంటూ ప్రజల ముందుకొస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu