Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో బాలకృష్ణ జోస్యం : జగన్ పార్టీకి నూకలు చెల్లాయ్!

హీరో బాలకృష్ణ జోస్యం : జగన్ పార్టీకి నూకలు చెల్లాయ్!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:24 IST)
File
FILE
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టు సినీ నటుడు, టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ జోస్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలంటే ఓటర్లు కాదని.. ప్రజలంటే ప్రభంజనమన్నారు.

టీడీపీ ఎప్పటికీ రైతుల పార్టీయేనన్న బాలయ్య యువతకు ఉద్యోగం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందేనన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం కల్తీ అయిందని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu