నేటి నుంచి బాలయ్య ప్రచారం.. శ్రీకాకుళం నుంచి స్టార్ట్!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (09:33 IST)
తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య నేడు శ్రీకాకళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్లో నరసన్నపేట నియోజకవర్గం సారవకోట చేరకుని 11.30 గంటలకు జరిగే రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పోలాకిలో, ఉర్లాంలో, ఆముదాల వలసల్లో జరిగే రోడో షో లో పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు సింగుపురంలో, శ్రీకూర్మలో, అనంతరం 8.30గంటలకు శ్రీకాకకుళం పట్టణంలో బాలకృష్ణ రోడ్ షోతో జిల్లాలో బాలకృష్ణ పర్యటన ముగియనుంది. ఈమేరకు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభంపాటి రామ్మోహన్రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.