Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారు : గిరిబాబు

ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారు : గిరిబాబు
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (12:04 IST)
File
FILE
స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు నాశనం చేశారంటూ సినీ నటుడు గిరిబాబు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే చంద్రబాబుకి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలే అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్ వారేనని, ఇక టీడీపీ ఎక్కడుందని నిలదీశారు. అందుకే టీడీపీకి ఆ పేరు సరిపోలేదని, పార్టీ పేరు కాంగ్రెస్ దేశంగా మారిస్తే చంద్రబాబుకు కలిసి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ తరపున గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని గిరిబాబు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu